కరోనా బ్రేక్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నూతన సినిమా సర్కారు వారి పాట పట్టాలెక్కేందుకు సిద్దంగా ఉంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సరెలేరు నీకెవ్వరు తరువాత మషేష్ ఈ సినిమాకు సంతం చేశాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది జనవరీలో మొదలు చేనున్నారు. అయితే ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మేకర్స్ దీనికోసం హైదరాబాద్లో ఓ స్పెషల్ సెట్ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన్ మహానటి కీర్తీ సురేష్ చేయనుంది. అంతేకాకుండా ఇది పరశురామ్ దర్శకత్వంలో రూపొందతుంది. ఈ చిత్ర షూటింగ్ను మొదటగా యూఎస్లో మొదలు పెట్టాలని ఆలోచించారు. కానీ కరోనా కేసుల పెరుగుదల కారణంగా యూఎస్ ప్లాన్ను కాన్సిల్ చేశారు. అయితే ఇంతలో హైదరాబాద్లో షూటింగ్ను మొదలు పెట్టాలను చిత్ర యూనిట్ ఆలోచించింది. అందుకు గాను హైదరాబాద్లో కావలసిన సన్నివేశాలు చిత్రంచేందుకు ప్రత్యేమైన సెట్ను ఏర్పరచనున్నారని సమాచారం. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.
previous post
next post