ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా వేసవి రద్దిని దృష్టిలో పెట్టుకొని.. స్వల్పకాలం పాటు 14 నూతన సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 7 నుంచి బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్ల నుంచి ముంబైల మధ్య విమాన సేవలతోపాటు హైదరాబాద్-పుణెల మధ్య సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
ముంబై-బెంగళూరుల మధ్య రోజుకు ఐదు సర్వీసులను నడుపనుంది. అలాగే, హైదరాబాద్, కలకత్తాల నుంచి ముంబైకి రోజుకు ఒక్క సర్వీసును మాత్రమే నడుపనున్నది. ఈ విమానాలు ఈ నెల 16 నుంచి జూలై 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అలాగే హైదరాబాద్-పుణె రూట్లలో నడుపన్ను అదనపు సర్వీసు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నదని పేర్కొంది.
సుశాంత్లో ఆమె ఆశలు రేకెత్తించింది… : కంగనా కామెంట్స్