telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది.

జలుబు, జ్వరం ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా.. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండి.. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

గ‌త కొన్ని రోజులుగా తనను కలిసిన వారు, తనతో సన్నిహితంగా ఉన్న వారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు. తమ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని పోచారం కోరారు. కాగా.. ఆయనకు కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి.

Related posts