telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్

SPB

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. సామాన్యులతో పాటు పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే కొంతమంది సెలెబ్రిటీలు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై, చూలాయిమేడులోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Related posts