telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా … వదంతులు నమ్మొద్దంటున్న ఎస్పీ చరణ్

SPB

గానగంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ఇటీవల బాలు వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమంగా ఉందని శుక్రవారం మధ్యాహ్నం వార్తలు రావడంతో అంతా షాక్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు ప్రకటించడంతో సంగీత ప్రియులు, బాలు శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలు గారు కోలుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు.

అయితే, ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలు కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ శుక్రవారం రాత్రి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. వదంతులను నమ్మవద్దని అన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై ఆరా తీస్తూ, ఆయన కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బాలు త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ఆయన మిత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు మ్యా్స్ట్రో ఇళయరాజా కోరుకున్నారు. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘ప్రియమైన అన్నయ్యా బాలుగారు.. మీ త్వరగా కోలుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ.. మీకోసం ప్రార్థనలు చేస్తున్నాను..’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అలాగే ఎ.ఆర్.రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్.. ఇలా ఎస్పీ బాలుతో పనిచేసిన సంగీత దర్శకులతో పాటు, తోటి గాయనీగాయకులు గానగంధర్వుడు గురించి దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Related posts