telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెప్టెంబర్ 25న ఇద్దరు ప్రముఖులను కోల్పోయిన టాలీవుడ్… వెంటాడుతున్న వరుస విషాదాలు

SPB-and-Venu-Madhav

2020లో సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోగా… మరోవైపు సినిమా ప్రముఖులు కరోనా కాటుకు బలవ్వడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే కరోనా కారణంగా ఇప్పటికే ఎంతోమందిని పోగొట్టుకున్న సినీ కళామతల్లి తాజాగా ఈరోజు (సెప్టెంబర్ 25న) సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కోల్పోయింది. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా గతేడాది ఇదే రోజు (2019 సెప్టెంబర్ 25)న టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. ఈ రెండు ఘటనలు యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఇండస్ట్రీకి మాత్రం తీరని ఆవేదనను మిగిల్చాయి. ఎస్పీ బాలు తన పాటలతో దేశాన్ని ఉర్రూతలూగించగా… వేణుమాధవ్ ఎందరో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గలేదు. కాగా ఇప్పటికే ప్రలువురు ప్రముఖులు కరోనా బాడిన పడి కోలుకున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం వరుస మరణాలు చోటు చేసుకుంటుండడం ఇండస్ట్రీని ఆందోళనకు, కలవరపాటుకు గురి చేస్తోంది

Related posts