లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోనుసూద్ ఎంతో మందికి అండగా నిలిచారు. తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది. సోను సూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బేగంపేటలో ని సోనూసూద్ పాస్ట్ ఫుడ్ సెంటర్ ను సోనూసూద్ సడన్ విజిట్ చేశారు. కాగా.. ఇటీవలే ఓ అభిమాని సోనూ సూద్కి ఏకంగా గుడి కట్టేశాడు. అది కూడా తన సొంత ఖర్చుతో సోనూ సూద్కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని. ఇది ఎక్కడో కాదు… సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాలో సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్కు సోనూసూద్ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్ తమ తండాలో సోనూ సూద్ కోసం ఏకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు.