telugu navyamedia
రాజకీయ వార్తలు

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు..రాహుల్ తో కలిసి విదేశాలకు సోనియా!

soniya rahul

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా ఈసారి సభకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

సోనియా ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు పయనమయ్యారు. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. సోనియా కొంతకాలం కిందటే విదేశాలకు వెళ్లాల్సి ఉన్నా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదా పడింది.

తల్లి వెంట విదేశాలకు వెళుతున్న రాహల్ వారం తర్వాత భారత్ తిరిగిరానున్నారు. వారం తర్వాత భారత్ నుంచి విదేశాలకు వెళ్లనున్న ప్రియాంక గాంధీ తల్లి వద్ద ఉంటారు.

ప్రియాంకను తల్లి వద్ద ఉంచి రాహుల్ పార్లమెంటు సమావేశాల కోసం స్వదేశం చేరుకుంటారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షల అనంతరం సోనియా గాంధీ రెండు వారాల తర్వాత సోనియా భారత్ కు చేరుకోనున్నారని తెలుస్తోంది.

Related posts