భారత్, చైనా సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై దేశ ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని అన్నారు.మన భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.20 మంది భారత జవాన్లు ప్రాణాలు ఎలా కోల్పోయారో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
మన భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందో చెప్పాలని నిలదీశారు. చైనాతో జరిగిన ఘర్షణలో ఎంత మంది ఆర్మీ అధికారులు, జవాన్లు మిస్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతమంది గాయపడ్డారో వెల్లడించాలని అడిగారు. ఇకపై చైనాతో భారత్ ఎలా వ్యవహరించబోతుందో దేశ ప్రజలకు మోదీ వివరించాలని అన్నారు.