telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దయచేసి ‘జంతువుల్లా’ప్రవర్తించండి… ఏనుగు మృతిపై ఘాటుగా స్పందించిన సోనాక్షి సిన్హా

Sonakshi-Sinha

కేరళలోని మలప్పురంలో మే 27న ఆకతాయిల కారణంగా ఏనుగు ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. ఏనుగు పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ట్వీట్‌ ను సోనాక్షి షేర్‌ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన కేంద్రం.. ఏనుగు మృతికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించారు. ప్రజలు ఎందుకు చాలా నీచంగా ‘జంతువు’లా ప్రవర్తిస్తారోనని సోనాక్షిసిన్హా మండిపడింది. “జంతువులు సరదా కోసమో, వినోదం కోసమో ఏ జీవిని చంపవు. కానీ వారు (ఆకతాయిలు) మాత్రం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే మూగజీవాల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి ‘జంతువుల్లా’ప్రవర్తించండి అంటూ ఘాటుగా చురకలంటించింది సోనాక్షిసిన్హా. మూగజీవి పట్ల ఇలా ప్రవర్తించిన వారిని తీవ్రంగా ఖండించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

Related posts