telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇళ్ళ స్థలాలపై విజిలెన్స్ కమిటీ వేయాలి: సోము వీర్రాజు

Somu Veerraju BJP

ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాలు పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారని మండిపడ్డారు. ఆవ భూములలో ఇళ్ల స్థలాలు పంపిణీని వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని సోము వీర్రాజు ప్రశ్నించారు.

ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆవ భూముల్లో రైతులకు ఇచ్చిన డబ్బుని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఆవలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాలపై విజిలెన్స్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

Related posts