ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్తైంది. 95 శాతం కంటే ఎక్కువగా మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లకు వైసీపీ అవలీలగా కైవసం చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ… ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇది ఇలా ఉండగా.. కర్నూల్ జిల్లా నంద్యాల మున్సిపాలిటి ఓట్ల లెక్కింపు సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నంద్యాల మున్సిపాలిటీలోని 29వ వార్డు ఓట్ల లెక్కింపు జరుపుతుండగా… బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు అధికారులను షాక్కు గురిచేశాయి. గ్రామ రోడ్లు, డ్రైనేజీ ఇతర సమస్యల గురించో బ్యాలెట్ బ్యాంక్స్ల్లో ఆ స్లిప్పులు వేశారానుకుంటే పొరబాటే. లిక్కర్ బ్రాండ్ల కోసం ఆ స్లిప్పులు వేశారు మందుబాబులు. అసలు ఆ స్లిప్పులో ఏముందంటే.. “నంద్యాల తాగుబోతుల విన్నపం.. విషయం : గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్న గారికి తాగుబోతుల యొక్క విన్నపం ఏమనగా… కొత్త బ్రాండ్స్ ను తొలగించి పాత బ్రాండ్స్ను అమ్మవలెనని విన్నపం. లేకపోతే మా యొక్క చివరి ఓటు కాగాలవని విన్నవించుకుంటున్నాము” అని పేర్కొన్నారు. అటు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు, జై అమరావతి అంటూ పలు చోట్ల స్లిప్పులు వెలుగుచూశాయి.
next post