telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..

తెలంగాణ‌లోని ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన తెరాస అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు.

టీఆర్ ఎస్‌ పార్టీ తరపున బరిలో దిగిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్​, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డికి రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారి ప్రకటించారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…. ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయని.. మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి దన్యవాధాలు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని… అభివృద్ధి చెందుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో లో చిత్తశుద్దితో పని చేస్తామని  వెల్ల‌డించారు.

Related posts