బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ దూరపు బంధువులని తెలుస్తోంది.
వివర్లాలోకి వెళితే..
మంగళవారం ఉదయం హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా గ్రామ సమీపంలో సికంద్రా-షేక్పురా జాతీయ రహదారి-333పై ట్రక్కు, సుమో ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగింది. సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి జాముయికి తిరిగి వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది.
అకస్మాత్తుగా, వారి వాహనం ఖాళీ ఎల్పిజి సిలిండర్లతో కూడిన ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్తో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో జముయిలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.
మృతులను లాల్జిత్ సింగ్, అతని ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్ అలియాస్ నేమాని సింగ్ మరియు రామ్ చంద్ర సింగ్, కుమార్తె బేబీ దేవి, మేనకోడలు అనితాదేవి మరియు డ్రైవర్ ప్రీతం కుమార్గా గుర్తించారు.
లాల్జిత్ సింగ్ హర్యానా సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ సింగ్కి బావ. ఓపీ సింగ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్కి బావ. ఓపీ సింగ్ సోదరి గీతాదేవి అంత్యక్రియలకు హాజరైన తర్వాత బాధితులు జాముయికి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.