telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శివప్రసాద్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

chandrababu

కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్.శివకుమార్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. శివప్రసాద్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు తన ట్వీట్ లో తెలిపారు. శివప్రసాద్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

ఈనెల 12 నుంచి శివప్రసాద్‌కు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే వ్యాధి తీవ్రమై పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆయన్ను తిరిగి చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

Related posts