telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డీజీపీ ఆఫీస్‌లో ‘సిట్‌’ సమావేశం

Case field Telangana Police Guntur Dist.

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్‌కు సహకరించిన ఏపీ ప్రభుత్వ సంస్థలపై దర్యాప్తునకు రంగం సిద్ధం చేశారు. ఎన్. శ్వేత, రోహిణిప్రియదర్శిని, జి. శ్రీధర్, బి. రవికుమార్ రెడ్డి, ఎన్. శ్యాంప్రసాదరావు, సీహెచ్ వై శ్రీనివాస్, బి. రమేష్, జి. వెంకట్ రామిరెడ్డిలతో కూడిన సిట్ బృందం సమావేశమైంది.

Related posts