ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యమైంది. గత వారం రోజుల వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు లేదంటూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వారం నుంచి వారి మొబైల్స్ కూడా స్విచ్చాఫ్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరులోని రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఆయనను ఎవరైనా చంపి రైల్వే ట్రాక్ మీద పడేశారా.. లేక ఆయనే రైలు నుంచి పడిపోయి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏకే రావు మృతిపై బెంగళూరు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు
హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఏకే రావు గత కొన్నేళ్లుగా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందిన ఆయన ఆయన సుజనా ఫౌండేషన్ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు . అయితే.. వారం నుంచి ఆయన ఆఫీస్ కి రాలేదని అక్కడ పనిచేసే వారు చెప్పారు.