telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు..

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తొలి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. దీంతో ఈ సీజన్​లో తొలి సూపర్​ 500 టైటిల్​ను దక్కించుకుంది డబుల్​ ఒలింపిక్ మెడలిస్ట్​ అయిన సింధు. ఆసియా ఛాంపియన్​షిప్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, 22 ఏళ్ల వాంగ్​.. సింధు ముందు తేలిపోయింది.

తొలి సెట్​ను అలవోకగా నెగ్గిన భారత షట్లర్​.. రెండో సెట్​ను 11-21తో కోల్పోయింది. మూడో సెట్​ను మళ్లీ 21-15తో గెల్చుకొని.. ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్​లో సింధుకు మొత్తంగా ఇది మూడో టైటిల్​. ఇప్పటికే 2022లో రెండు సూపర్​ 300 టైటిళ్లు గెల్చుకుంది సింధు.

ఇందులో సయ్యద్​ మోదీ ఇంటర్నేషనల్​, స్విస్​ ఓపెన్​ ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్​ ఓపెన్​ విజేతగా నిలిచింది. 58 నిమిషాల పాటు సాగిన ఈ తుది పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది.

Related posts