telugu navyamedia
రాజకీయ వార్తలు

అవినీతిపై మోదీతో చర్చకు సిద్ధం: సిద్ధూ

EC Issues notices to Minister siddu

అవినీతిపై ప్రధాని మోదీతో తాను సిద్ధంగా ఉన్నానని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. 2014 ఎన్నికల్లో గంగామాత పుత్రుడినని చెప్పుకొని మోదీ వచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో రాఫెల్ ఏజెంట్ అనే ముద్ర వేసుకుని వెళ్లిపోతారని అన్నారు. రాఫెల్ డీల్ లో బ్రోకరేజ్ సొమ్ము తీసుకున్నారో, లేదో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మోదీతో చర్చకు తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.

స్వయంగా అవినీతికి పాల్పడ్డారా లేదా మరెవరైనా అవినీతికి పాల్పడటానికి సహకరించారా అనే విషయంపై మోదీ తనతో చర్చకు రావాలని సిద్ధూ సవాల్ విసిరారు. ఈ చర్చలో తాను ఓడిపోతే రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని చెప్పారు. మోదీతో చర్చకు రాహుల్ గాంధీ అవసరంలేదని తెలిపారు. రాహుల్ ఫిరంగి అయితే, తాను ఏకే47 అని సిద్ధూ వ్యాఖ్యానించారు.

Related posts