రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ తాజాగా మొదలు చేసిన సినిమా సలార్. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ తాజాగా పాల్గొన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రామగూడెంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆ చుట్టుపక్కల ప్రజలంతా తమ అభిమాన హీరోను చూసేందుకు తరలి వచ్చారు. అయితే తెలుగులో రీ ఎంట్రీ తరువాత శ్రుతి చేసిన మొదటి సినిమా క్రాక్. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో అమ్మడి రేంజ్ కూడా బాగా పెరిగింది. క్రాక్ సినిమా తరువాత శ్రుతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జోడీగా వకీల్సాబ్ సినిమాలో నటించారు. అయితే ఈ అమ్మడు సలార్ సినిమాకి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రీ ఎంట్రీ మొదట్లోనే క్రాక్ వంటి హిట్ పడటంతో శ్రుతి పారితోషికం భారీగా పెంచేశారని, సలార్ సినిమాకి దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇందులో ఎంత నిజమన్నది తెలియదు. ఇదిలా ఉంటే ఇటీవల పూజా కార్యక్రమాలతో సలార్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం తెలంగాణ రామగూడెంలో జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ కూడా తాజాగా చేరారు. ఇప్పటికే లీకైన ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
previous post