telugu navyamedia
Uncategorized

రానా, శృతి హాసన్ జంటగా వెబ్ సిరీస్

Rana

దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో రానా, శృతిహాసన్ కాంబినేషన్లో త్వరలో ఓ వెబ్ సిరీస్ రానుంది. దీనికి నాగ్ అశ్విన్ కథను మాత్రమే అందిస్తుండగా, కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారట. ఇక థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుంది. 10 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ ఉండనుండగా, తెలుగులో దీన్ని తెరకెక్కిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం. వెబ్‌సిరీస్‌ను మొదట తెలుగు భాషలో చిత్రీకరించి తర్వాత పది భాషల్లో విడుదల చేస్తామని తెలిపారు. ఇక దగ్గుబాటి రానా ‘అరణ్య’ అనే మల్టీల్యాంగేజ్ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ‘విరాట పర్వం’ చిత్రంలో రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ‘హిరణ్యకశ్యప’ చిత్రం కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు రానా సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సురేష్ బాబు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థతో కలిసి దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు.

Related posts