రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’.. హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రంలో పవన్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పవన్ హీరోయిన్ శృతి హాసన్ షూటింగ్కు హాజరు కాలేదు. గెస్ట్ రోల్ అయినా సినిమా కీ శృతిహాసన్ పాత్ర చాలా కీలకమని అంటున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్లోకి వచ్చిన శృతి హాసన్.. `వకీల్ సాబ్` గురించి మాట్లాడింది. పవన్ మళ్లీ సినిమాలు చేస్తుండడం సంతోషంగా ఉంది. ఆయన రీ-ఎంట్రీ సినిమాలో నేను భాగమైనందుకు మరింత ఆనందంగా ఉంది. జనవరి నుంచి ‘వకీల్ సాబ్’ షూటింగ్కు హాజరవుతా. పవన్తో మూడోసారి పనిచేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి చూడాలి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది.
యాంకర్ ప్రదీప్ కు ఆ హీరోయిన్ తో ఎఫైర్… దర్శకుడి సంచలన వ్యాఖ్యలు