పదేళ్ళ క్రితం 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో శ్రుతీహాసన్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా శ్రుతికి నిరాశను కలిగించింది. అలానే అటు హిందీ, ఇటు తమిళ సినిమాలు సైతం వరుసగా పరాజయం పాలయ్యాయి. అదే సమయంలో కాప్ స్టోరీ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ శుత్రికి తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ పవర్ కళ్యాణ్ భార్యగా తొలి విజయాన్ని తన ఖాతాలో తెలుగులో నమోదు చేసుకున్న శ్రుతీహాసన్ ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… కాప్ స్టోరీ ‘క్రాక్’తోనే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లోనూ ఈ భామ ఉంది. తాజాగా పిట్టకథలు వెబ్ మూవీ పూర్తి చేసింది. నలుగురు దర్శకులు రూపొందించిన ఆంథాలజీ ఇది. నాగ అశ్విన్ ఎక్స్లైఫ్ అనే కథని తెరకెక్కించారు. ఇందులో శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారి. శ్రుతి పాత్ర ఇందులో చాలా బోల్డ్గా హాట్గా ఉండబోతుందట. తను లెస్బియన్గా కనిపించనుందని టాక్. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.