2001లో ‘”ఇష్టం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. 18 ఏళ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కొశ్చెవ్ని రాజస్థాన్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి తర్వాత సినిమాలని పూర్తిగా తగ్గించేసింది. చివరిగా “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రంతో పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్”, “సండకారి” సినిమాలలో నటిస్తోంది. అయితే శ్రియ సోషల్ మీడియాను శ్రియా బాగానే ఉపయోగించుకుంటుంది. గ్లామర్ ఫొటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ కుర్రకారును, అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె పాత్రల ఎంపికలో శ్రియా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే ఓ ఛాలెంజింగ్ రోల్ ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. వివరాల ప్రకారం శ్రియా చెవులు వినపడని తల్లి పాత్రలో కనిపించనున్నారట. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుజన దర్శకత్వం వహిస్తున్నారు. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
previous post