telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన శ్రియ

Shriya

ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమా లో నటిస్తున్న నితిన్ ఆ తరవాత బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “అంధాదున్ ” సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అంధాదున్’ మూవీ మంచి విజయం సాధించింది. ఆ మూవీలో నటనకు గాను హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయనున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ మూవీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ మూవీలో బోల్డ్ నెస్ తో కూడిన నెగెటివ్ రోల్ ఒకటి ఉంది. హిందీలో ఆ పాత్రను హీరోయిన్ టబు చేశారు. ఇక తెలుగులో ఈ పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. రమ్య కృష్ణ, అనసూయ అంటూ అనేక పేర్లు వినిపించాయి. అయితే మొదట టబునే తెలుగులో ఆ పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నయనతార నటిస్తుంది అన్నారు. ఆ తరువాత ఈ చిత్రబృందం శ్రియాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలపై శ్రియ స్పందించింది. ఈ చిత్రానికి తాను ఓకే చెప్పినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శ్రియ తాజాగా పేర్కొంది. ‘ఈ చిత్ర యూనిట్ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పింది. ఇక “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

Related posts