దసరా, దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగలు. దసరా ఆశ్వయుజ శుక్ల పక్షం పదో రోజున దసరా నిర్వహిస్తారు. అయితే, మన పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీ రాముడు రాక్షసుడైన రావణుడిని వధిస్తాడు.
ప్రతి సంవత్సరం హిందు క్యాలెండర్ ప్రకారం సరిగ్గా దసరా తరువాత 21 రోజుల తరువాత దీపావళి వస్తుంది..శ్రీరామ చంద్రుడు సైనం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు.
సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మన హిందువులు దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము..వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు. మహర్షిగా మారిన వాల్మీకి దండకార్యణం గుండా దక్షిణ భారతదేశం , ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడని పురణాలు చెబుతున్నాయి.
మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ అడవి ఆకులు , దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశాడని అంటారు. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు మనం గర్వపడాలి.