telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యతో ఆడిపాడనున్న ఆ ఇద్దరు హీరోయిన్లు ?

Shriya-and-Nayan

గ‌త ఏడాది డిసెంబర్‌లో “రూల‌ర్‌”గా సంద‌డి చేసిన బాల‌య్య ఈ ఏడాది బోయపాటి దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో బాలకృష్ణ అఘోరాగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య అసెంబ్లీలో బాల‌య్య గుండుతో క‌నిపించారు. ఆయ‌న‌ని చూసిన అభిమానులు బోయ‌పాటి సినిమా కోసం స‌రికొత్త లుక్ ట్రై చేస్తున్నాడని అంటున్నాయి. అయితే కొంతకాలంగా ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. కానీ.. ఇప్పుడు ఆ పుకార్లకు చెక్ పెడుతూ.. బాలయ్య హీరోయిన్స్‌ని ఫైనల్ చేశాడు బోయపాటి. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా శ్రియ, మరో కథానాయికగా నయనతార నటించబోతున్నారట. గతంలో ‘సింహా’, ‘జై సింహా’ చిత్రాల్లో బాలయ్యతో కలిసి నటించింది నయనతార. అలాగే ‘చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ చిత్రాల్లో బాలకృష్ణతో జోడీ కట్టింది శ్రియ. దీనితో ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి నటిస్తుండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఇక గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన వీరు … సుదీర్ఘ విరామం తరువాత.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జట్టు కట్టారు.

Related posts