పాకిస్థాన్ జట్టులో ఉన్న సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ పర్యటన కోసం పీసీబీ ఎంపిక చేసిన జట్టులో షోయబ్ మాలిక్కు చోటు దక్కలేదు. అతనితో పాటు మరో సీనియర్ క్రికెటర్ పేసర్ మొహమ్మద్ అమీర్ ను తుది జట్టులోకి తీసుకోలేదు. తాజాగా జరిగిన జింబాబ్వే టూర్కు సైతం అతన్ని పక్కన పెట్టారు. మాలిక్, తన క్రికెట్ కేరిర్ కు గుడ్ బై చెప్పే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే 38 ఏళ్ళ మాలిక్ పాకిస్థాన్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ పాక్ ఆటగాడు భారత క్రీడాకారిణి అయిన సానియా మీర్జాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అందువల్ల మాలిక్ క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పిన తర్వాత భార్య సానియాతో కలిసి ఇండియాలో ఉంటారా లేక పాక్లోనే ఉంటారా అనే దానిపై అభిమానులు చర్చికుంటున్నారు. ఈ దంపతులు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సానీయా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మొట్టమొదటిసారి టీవీ సిరీస్లో నటించబోతున్నారు. క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఎమ్టివి నిషేద్ అలోన్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు సానియా మీర్జా.
previous post
next post