పొడుగు కాళ్ళ సుందరి, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి బహిరంగ ముద్దు కేసు నుంచి బయటపడింది. పదిహేనేళ్ల క్రితం నమోదైన ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం శిల్పా శెట్టి బాధితురాలని పేర్కొంది.
2007, ఏప్రిల్ 15న రాజస్థాన్ లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేక అతిథులుగా శిల్పాశెట్టి, హాలీవుడ్ హీరో రిచర్డ్ గెరె కూడా వచ్చారు. ఎయిడ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో శిల్పా శెట్టి అందానికి రిచర్డ్ గేర్ ముగ్ధుడయ్యాడు. శిల్పా ఆమె చేతులు పట్టుకుంటూ ఎదురుగా వెళ్లి ముద్దుల వర్షం కురిపించాడు.
అది చూసి అక్కడున్న వారే కాదు, టీవీల్లో, పత్రికల్లో చూసిన వారు కూడా ఆశ్చర్యపోయారు. రిచర్డ్ గెరె బలవంతంగా ముద్దు పెడుతున్నప్పుడు శిల్పాశెట్టి అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణ.
అందరూ చూస్తుండగా బహిరంగంగా అలా ప్రవర్తించడం తప్పని వారణాసి, కాన్పూర్, దిల్లీ, ముంబై నగరాలతో సహా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో వారిద్దరి మధ్య కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 292, 293, 294 కింద కేసులు పెట్టారు.
అయితే సెలెబ్రిటీలిద్దరూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వారిద్దరి అరెస్ట్ వారెంట్లను రద్దు చేసింది. అప్పట్నించి కేసు విచారణ సాగుతూనే ఉంది. కేసు రాజస్థాన్లో నమోదు కాదా శిల్పా ముంబై కోర్టుకు బదిలీ చేయించుకుంది. తాజాగా మరోమారు ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అందులో ఆమె తప్పేమీ లేదని కోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో శిల్పాశెట్టి సంతోషంగా ఉన్నారు.
ఆ సినిమా అంటే చంద్రబాబుకు భయం: లక్ష్మీపార్వతి