telugu navyamedia
రాజకీయ

ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్‌ క్లారిటీ

congress and aap party alliance
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీ చేస్తాయని కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. త్వరలో జరగనున్న  సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)తో పొత్తు ఉండదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో మం‍గళవారం ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం షీలా దీక్షిత్‌ పొత్తు విషయం వెల్లడించారు. 
ఢిల్లీలో బీజేపీ  గెలుపును నిరోధించేందుకు ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు అవసరమని కేజ్రీవాల్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌లు పరస్పరం ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న క్రమంలో ఆప్‌తో పొత్తు కుదరదని  సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ కు  తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపారు.

Related posts