టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఆ పార్టీ రాష్ట్ర నేత చెన్నంశెట్టి శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో శశికుమార్ కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ని అక్రమంగా ఇరికించేలా సీబీఐ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ బాబు అప్పట్లో తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.కేసు విచారణలో జగన్ పేరు చెప్పలేదని అప్పటి నుంచి తనపై పార్టీ పెద్దలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని శశికుమార్ తెలిపారు.
చంద్రబాబు చెప్పినట్లు వినలేదనే ఐదేళ్ల కాలంలో తనకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పనిచేస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం తనను పట్టించుకోలేదని శశికుమార్ వాపోయారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత తీరు మార్చుకోకపోతే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్దలు కేవలం వారి సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టరని ఆరోపించారు.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్దం: సుజనా చౌదరి