telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం : ప‌లువురు ఐఏఎస్‌లు బ‌దిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‎లను బదిలీలు జ‌రిగాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

గిరిజా శంకర్‎ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా బాధ్యతలు అప్పగించింది. పౌరసరఫరాల శాఖగా స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‍కుమార్‎కు బాధ్యతలు కట్టబెట్టింది. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‍కు అదనపు బాధ్యతలు అప్పగించింది.ఇక, గత నెలలో కూడా ఏపీ సర్కార్ పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టిన సంగతి తెలిసిందే

Related posts