ప్రస్తుతం డ్రగ్స్ కేసు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీ, నటులు ఈడీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు… ఎవరి పేరు బయటకు వస్తుందోనని.. సినీ తారలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యం లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై నటి పూనమ్ కౌర్ స్పందించారు. నిత్యం కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో, ట్వీట్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారే పూనమ్ కౌర్ తాజాగా డ్రగ్స్ విషయమై ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాయి.
కాగా… ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణ లో ఉంది. ఉదయం ఈడీ విచారణకు హజరైంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఎఫ్ క్లబ్ పార్టీ తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్ మేనేజర్ కాల్ లిస్ట్లో రకుల్ ఉంది. మేనేజర్ ఆర్ధిక వ్యవహారాలలో రకుల్ పేరుతో పాటు… రకుల్, నవదీప్, కెల్విన్ మధ్య లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కోణంలోనే రకుల్ ప్రీత్ సింగ్ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు.
కాగా..కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, నవ్దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్లకు ఈడీ అధికారులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.