తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సికింద్రాబాద్ యశోదా హాస్పటల్లో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. వేణుమాధవ్ సుస్వాగతం, మాస్టర్, తొలిప్రేమ, తమ్ముడు, ఆది, వాసు, జెమినీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, సూపర్, పోకిరి, యోగి తదితర చిత్రాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించారు వేణు మాధవ్. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. బుల్లితెరపై కొన్ని షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. దాదాపుగా 170 చిత్రాల్లో నటించారు.