మాచో హీరో గోపిచంద్ అక్టోబర్ 5న “చాణక్య” అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ఈ చిత్రంలో బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మరోవైపు గోపిచంద్ 28వ ప్రాజెక్ట్కి సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫీషియల్ ప్రకటన వచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ 28వ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంపిక చేశారు. సంపత్ నంది, గోపి చంద్ కాంబినేషన్లో “గౌతమ్ నందా” అనే చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రం 2017లో విడుదలై మిక్స్డ్ టాక్ పొందింది. తమన్నా, సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్ అనే చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాకు “సీటీమార్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.