telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు రేప్‌

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన ఈ నెల 4న జరిగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివ‌రాల్లోకి వెళితే..

అస్సామ్‌ రాష్ట్రానికి చెందిన యువతి(22) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 5లోని దేవరకొండ బస్తీలో అక్కాబావల వద్ద ఉంటూ ఓ మల్టీఫ్లెక్స్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో పనిచేస్తోంది.అదే రాష్ట్రానికి చెందిన చిన్మయ్‌ సైకియా(24) అనే యువకుడు కూడా అదే ప్రాంతంతో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఓ షాపింగ్‌ మాల్‌లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. దీంతో చిన్మయి సైక్యా (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్ర‌మంలో ఆ యువకుడు యువతిపై కన్నేశాడు.

ఈ నెల 4న బాధితురాలి ఇంటికి ఏదో పని ఉందంటూ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన అతను.. యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతేకాకుండా ఈ విష‌యం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

అప్పటి నుంచి తీవ్రంగా ఏడుస్తూ ఇంట్లోనే ఉంటోంది. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని.. ఆ యువతి మరుసటి రోజు ఉదయం తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెస్సెజ్ పంపింది. వెంట‌నే బాదితురాలి అక్క‌కు విష‌యం తెలియ‌జేయ‌డంతో విషయం బయటపడింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Related posts