telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మే 15 నుంచి రెండో దశ లాక్ డౌన్ ?

one nation one day salary slogan by modi

ఈనెల 14 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా? లేదా లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేస్తారా? చేస్తే ఏయే రంగాలకు మినహాయింపులిస్తారు? ఎవరిని రోడ్లపైకి అనుమతిస్తారు? ఇవన్నీ సాధారణ పౌరులను తొలుస్తున్న ప్రశ్నలు. అయితే లాక్‌డౌన్ ఎత్తేసే విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఏప్రిల్ 14 న లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత…. మే 15 నుంచి రెండో దశ లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని కేంద్ర మంత్రుల మధ్య చర్చ వచ్చినట్లు సమాచారం. అయితే మొదటి దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా మంత్రులు మాట్లాడుకున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసినా సరే… నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని, అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలని వారు భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు. అయితే నిత్యావసరాలను అమ్మే మాల్స్‌కు మాత్రం మినహాయింపు ఇస్తే బాగుంటుందని భావించినట్లు సమాచారం. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది. అయితే కరోనా వైరస్‌తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని, రాష్ట్రమంతటా కోవిడ్ – 19 పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రులు భావించారు.

పై నిర్ణయాలేవీ అధికారికంగా తీసుకోనప్పటికీ, అత్యంత కీలకమైన 16 మంది కేంద్ర మంత్రులు పాల్గొన్న సమావేశంలో మాత్రం ఈ ప్రతిపాదనలన్నీ కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి మే 15 నుంచి రెండో దశ లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు క్వారంటైన్‌లో ఉంటున్న వారిని జీపీఎస్ ట్రాకర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు, బాధ్యులు పర్యవేక్షించాలని, అయితే ఇది ఎంత వరకు సాధ్యమనేది మంత్రులు చర్చించారు. ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ఉద్యోగులకు మరో నెల పాటు ఇదే వసతి కొనసాగిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా రద్దీ లేకుండా ఆయా యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలని మంత్రుల బృందం భావించినట్లు సమాచారం.

Related posts