telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో థియేటర్లు, మాల్స్, స్కూళ్లు బంద్..

karona

కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.,సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts