తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలలకు సెలవులు పొడగించారు. వేసవి సెలవులు ముగించుకొని వచ్చే నెల 12 నుంచి ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1 నుంచే బడులు ప్రారంభం కావాల్సి ఉంది. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 11 వరకు బడులకు సెలవులు పొడిగించాలని, 12 నుంచి బడులు తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో జూన్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట పై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి జూన్ 1న బడులు ప్రారంభమవుతాయి కాబట్టి టీచర్లంతా 1 నుంచి 3 వరకు బడి బాట కార్యక్రమాలకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, 4 నుంచి బడిబాటను నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు పాఠశాలల పునఃప్రారంభం తేదీని 12కు వాయిదా వేయడంతో బడిబాటపై స్పష్టత రావాల్సి ఉంది.