telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

స్కూల్ బస్సు బోల్తా.. 1 5 మందికి గాయాలు

Accident

వేములవాడ పాఠశాల వ్యాన్ బోల్తా పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన మరచిపోకముందే నెల్లూరు జిల్లాలో అదుపుతప్పి స్కూల్ వ్యాన్ బోల్తాపడింది. వెంకటగిరి శ్రీచైతన్య పాఠశాలకు చెందిన బస్సు విద్యార్ధులతో వెళ్తుండగా మార్గమధ్యన డక్కిలి మండలం కుప్పాయపాలెం వంతెనపై బోల్తాపడింది.

ఈ ఘటనలో 15 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్ధులను డక్కిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Related posts