వేములవాడ పాఠశాల వ్యాన్ బోల్తా పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన మరచిపోకముందే నెల్లూరు జిల్లాలో అదుపుతప్పి స్కూల్ వ్యాన్ బోల్తాపడింది. వెంకటగిరి శ్రీచైతన్య పాఠశాలకు చెందిన బస్సు విద్యార్ధులతో వెళ్తుండగా మార్గమధ్యన డక్కిలి మండలం కుప్పాయపాలెం వంతెనపై బోల్తాపడింది.
ఈ ఘటనలో 15 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్ధులను డక్కిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్.. పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు!