అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు షాకిచ్చింది. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించింది. నెలకు ఒక్కసారి మాత్రమే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు ఈ అవకాశం మూడుసార్లు ఉండేది. తాజా నిర్ణయంతో ఖాతాదారులు తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లో భాగస్వామ్యం కాని ఖాతాదారులు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు వినియోగించుకోవచ్చు.