telugu navyamedia
సినిమా వార్తలు

సావిత్రమ్మా.. వెండితెరపై మరోసారి విజయం సాధించావు… : మహానటి నిర్మాతలు

Mahanati

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గ‌త ఏడాది సావిత్రి జీవిత నేప‌థ్యంలో “మ‌హాన‌టి” అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. చైనాలోని షాంగై లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌యిన తొలి ఇండియ‌న్ సినిమాగా “మ‌హాన‌టి” అరుదైన ఘ‌న‌త సాధించింది. తన అసమాన నటనతో ప్రేక్షకుల గుండెల్లో `మహానటి`గా శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు సావిత్రి. తన నటనతో కొన్ని తరాలను ప్రభావితం చేసిన సావిత్రి జీవితకథ ఆధారంగా `మహానటి` సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రేక్షకుల రివార్డులను పొందిన ఈ చిత్రం తాజాగా జాతీయ అవార్డులనూ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంక దత్ సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. “సావిత్రమ్మా.. వెండితెరపై నువ్వు మరోసారి విజయం సాధించావు. నువ్వు గర్వపడేలా మేమందరం పనిచేశామనుకుంటున్నాం” అంటూ ట్వీట్ చేశారు.

Related posts