నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గత ఏడాది సావిత్రి జీవిత నేపథ్యంలో “మహానటి” అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టింది. చైనాలోని షాంగై లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. షాంగైలో ప్రదర్శితమయిన తొలి ఇండియన్ సినిమాగా “మహానటి” అరుదైన ఘనత సాధించింది. తన అసమాన నటనతో ప్రేక్షకుల గుండెల్లో `మహానటి`గా శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు సావిత్రి. తన నటనతో కొన్ని తరాలను ప్రభావితం చేసిన సావిత్రి జీవితకథ ఆధారంగా `మహానటి` సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రేక్షకుల రివార్డులను పొందిన ఈ చిత్రం తాజాగా జాతీయ అవార్డులనూ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంక దత్ సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. “సావిత్రమ్మా.. వెండితెరపై నువ్వు మరోసారి విజయం సాధించావు. నువ్వు గర్వపడేలా మేమందరం పనిచేశామనుకుంటున్నాం” అంటూ ట్వీట్ చేశారు.
Savitramma, this is your victory on the silver screen again. Hope we all made you proud. #MahanatiForever pic.twitter.com/QQqaV9EH0L
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) 12 August 2019
ఆ సీన్ టీడీపీ వాళ్ళకే ఎక్కువ నచ్చింది… చాలా సంతోషిస్తున్నారు : ఆర్జీవీ