telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ విమానాలపై సౌదీ తాత్కాలిక నిషేధం!

Saudi Arabia

భారత్ నుంచి విమాన రాకపోకలపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కారణంతో బ్రెజిల్, అర్జెంటీనా విమాన రాకపోకలను కూడా నిషేధించింది. ఈ దేశాల నుంచి వచ్చే సాధారణ ప్రయాణికులపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే, అధికారిక కార్యకలాపాలపై వచ్చేవారి ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పింది.

Related posts