telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బొమ్మ దద్దరిల్లిపోద్ది… “సరిలేరు నీకెవ్వరు” ట్రైలర్

SN

మహేశ్ బాబు, రష్మిక మందనా కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. కామెడీ సన్నివేశాలతో షురూ అయి..ఆ తర్వాత ప్రకాశ్‌ రాజ్‌, మహేశ్‌, విజయశాంతి పంచ్‌ డైలాగులతో సాగే ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “చుట్టూ వందమంది మధ్యలో ఒకడు..టచ్‌ చేయండి ఎవడైనా వెళ్లి టచ్‌ చేయండి..” అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్స్‌ బాగున్నాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది.

Related posts