telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొండారెడ్డి బురుజు వద్ద గొడ్డలితో మహేష్… సరిలేరు నీకెవ్వరు

SN

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్‌ను దసరా శుభాకాంక్షలతో విడుదల చేశారు. ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్‌ షెడ్యూల్‌తో నవంబర్‌ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో కొండారెడ్డి బురుజు సెంటర్‌లో మహేష్ గొడ్డలి పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో ఉన్నారు. ఆయన వేసుకున్న డ్రస్, చేతిలో గొడ్డలి చూస్తుంటే.. ఈ సీన్ సినిమాకు పెద్ద హైలెట్ అనేలా ఉంది.

Related posts