telugu navyamedia
క్రీడలు వార్తలు

టాస్ కాయిన్ నాకు బాగా నచ్చింది : సంజు

ఐపీఎల్‌ 2021లో భాగంగా నిన్న రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్ ‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులకు అసలైన మజాను పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి శాంసన్ క్యాచ్ ఔట్ అవ్వడంతో రాయల్స్‌ 4 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. మ్యాచ్ అనంతరం రాజస్తాన్‌ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ… ‘అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. విజయానికి అత్యంత చేరువగా వెళ్లాం. కానీ దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదు. ఇంతకంటే నేను ఏం చేయగలను. ఆటలో ఇవన్నీ సహజమే. వికెట్‌ మెరుగు పడుతుంది.. టార్గెట్‌ను సులభంగా ఛేదించగలమని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. మేము మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అందరూ బాగా ఆడారు’ అని అన్నాడు. ఇక టాస్‌ వేసిన నాణెం బాగుంది. అందుకే జేబులో వేసుకున్నా. తీసుకోవచ్చా అని రిఫరీని అడిగితే వద్దన్నాడు’ అని తెలిపాడు.

Related posts