2005-07 మధ్య కాలంలో భారత జట్టు కోచ్గా పనిచేసిన గ్రేగ్ చాపెల్ భారత క్రికెట్ నాశనాన్ని కోరుకున్నాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఒక సందర్భంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్పై కోపడ్డాడట! 2005 జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా వెల్లడించాడు. తాజాగా ఈ విషయం పై మాట్లాడుతూ.. లక్ష్మణ్పై చాపెల్ అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేసుకున్నాడు. కోచ్ ప్రవర్తన పట్ల లక్ష్మణ్ షాక్కు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. ‘2005లో జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. గాయం కారణంగా వీవీఎస్ లక్ష్మణ్ మైదానం వీడాడు. ఆ తర్వాత అతని దగ్గరికి వచ్చి చాపెల్ అనరాని మాటలు అన్నాడని మంజ్రేకర్ తెలిపాడు. ‘ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో కాఫీ తాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ను ఫీల్డ్ నుంచి ఎందుకు వచ్చావంటూ చాపెల్ ప్రశ్నించాడు. గాయం కారణంగా మైదానం వీడానని, ఐస్ పెట్టుకోవడానికి వచ్చానని లక్ష్మణ్ బదులిచ్చాడు. అయినప్పటికీ.. అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా? అని గ్రెగ్ చాపెల్ అసహనం వ్యక్తం చేశాడు. అలాంటి సందర్భం వస్తే కానీ.. మైదానంలో నుంచి బయటకు రావద్దని మందలించాడు. దాంతో లక్ష్మణ్ షాక్కు గురయ్యాడు.’అని మంజ్రేకర్ పేర్కొన్నాడు
previous post
next post
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…