బాలీవుడు ప్రముఖ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, నాలుగో స్టేజ్లో ఉందని ఇటీవలే వెల్లడైన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ ప్రాణ మిత్రుడు పరేష్ ఘెలాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “సంజయ్.. జీవితంలో తర్వాతి దశను ఆస్వాదించడం గురించి ఇటీవలె మనం మాట్లాడుకున్నాం. నడవగలుగుతున్నందుకు, జాగింగ్ చేయగలుగుతున్నందుకు, ప్రయాణించగలుగుతున్నందుకు ఎంతో అదృష్టవంతులమని అనుకున్నాం. భవిష్యత్తు కూడా ఇంతే ఆనందంగా, కలర్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నా. మనం ఇప్పటికే అమ్యూజ్మెంట్ పార్క్ అంతా తిరిగేశామని అనుకున్నాం. అయితే మనం ఇంకా చూడాల్సింది ఉంది. మరో రోలర్ కోస్టర్ రైడ్కు సిద్ధమవ్వాలి. మరో యుద్ధాన్ని మొదలు పెట్టాలి. నీ మనోస్థైర్యం గురించి తెలుసు. నువ్వు కచ్చితంగా గెలుస్తావు”అని పరేష్ పేర్కొన్నారు.
previous post
next post
రాజశేఖర్ ను ఫ్రాడ్ అన్న జీవిత… అందరూ షాక్…!?