బాలీవుడ్ స్టార్ సంజయ్దత్ ఇటీవలే లంగ్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న ఆయన ముంబయిలో తొలి దశ కీమోథెరపీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భార్య మాన్య, పిల్లలతో కలిసి దుబాయ్లో ఉంటున్నారు. అయితే తాజాగా సంజయ్దత్కు చెందిన ఓ ఫోటో అభిమానులను షాక్కు గురిచేస్తోంది. ఎయిర్పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫోటోను సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సంజూ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు డాక్టర్లు అన్నిరకాల టెస్టులు చేయగా క్యాన్సర్ అని తేలింది. సంజూకు లంగ్ క్యాన్సర్ అడ్వాన్డ్స్ స్టేజ్లో ఉందని, ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. సంజూభాయ్ చివరగా సడక్-2 సినిమాలో నటించారు. ‘భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. దీనితో పాటు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ -2లో అధీర అనే రోల్లో కనిపించనున్నారు.
previous post