కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండస్ట్రీలని షాక్కి గురి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే.. తాజాగా ఈ మూవీ షూటింగ్లో భాగంగా.. కీలక సన్నివేశాల కోసం ముఖ్య నటీనటులు హైదరాబాద్ చేరుకున్నారు. వారిలో హీరో యశ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు. అయితే ఈ షూటింగ్ హైదరాబాద్లో మరో రెండు మూడు వారాలు జరగనుంది. వచ్చే నెల చిరికి ఈ సినిమా షూటింగ్ను పూర్తి అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాకు తెలుగు మరియు హిందీ భాషల్లోనూ మంచి టాక్ ఉంది. భారీ అంచనాలతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
previous post
next post